పాము కాటుతో బాలుడు మృతి
ELR: వేలేరుపాడు మండలం జిన్నెలగూడెంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. తురసం రవి, లక్ష్మీ దంపతుల రెండేళ్ల కుమారుడు ధనుష్ ఇంట్లో నిద్రిస్తుండగా త్రాచుపాము కరిచింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు సంతానంలో కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.