'మ్యాన్ హోల్ ఘటనకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇంఛార్జ్ బాధ్యుడు'

HYD: మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. మ్యాన్ హోల్ ఘటనపై ఉదయం ప్రాథమిక విచారణ జరిగిందని, మ్యాన్ హోల్ ఘటనలో హైడ్రాదే పూర్తి బాధ్యత అన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇంఛార్జ్ ఘటనకు బాధ్యుడని, మ్యాన్ హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకున్నామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.