సంగమేశ్వర స్వామికి విశేష పూజలు
SRD: మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీ కేతకి ఆలయంలో ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కృష్ణపక్షం చవితి సందర్భంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు. భక్తులు ఆలయానికి ఉదయాన్నే చేరుకొని అమృత గుండంలో స్థానమాచరించి సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు.