కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య
NDL: నందికొట్కూరు పట్టణం, మారుతి నగర్లో ఎమ్మెల్య గిత్త జయసూర్య నేడు పర్యటించారు. మొంథా తుఫాన్ కారణంగా రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపు నీటిని పరిశీలించి ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మండల తాసీల్దార్ శ్రీనివాసులు, కమిషనర్ బేబికి ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులు, నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.