వత్సవాయిలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

NTR: వత్సవాయిలో శుక్రవారం గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. బావి వద్ద గడ్డి చెదిరిన ఆనవాళ్లు, మద్యం సీసాలు దొరకగా, పెనుగులాట జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మెడలో నల్లపూసల దండ ఆధారంగా ముస్లిం మహిళగా స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.