ఎమ్మెల్యేను కలిసిన NRI కాస రాకేష్ యాదవ్
SRPT: తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ను శనివారం హైదరాబాద్లోని వారి నివాసంలో మండల పరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన NRI కాస రాకేష్ యాదవ్, కొమ్ము నగేష్లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక మొక్కను బహుకరించి, నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధిపై చర్చించారు.