గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
E.G: రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి ప్రతి పనిని క్షుణ్ణంగా సమీక్షించారు. పనుల వేగాన్ని మరింత పెంచి త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.