రాధాకృష్ణపై ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి
SKLM: వైసీపీ కుటుంబ సభ్యులు, మహిళలపై ఏబీఎన్ అధినేత ఈ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి అప్పలరాజు అన్నారు. గురువారం పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై సీఐ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీడియా నైతిక విలువలను పాటించాలని అన్నారు.