HIT TV SPECIAL: చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత
GNTR: 1930 మార్చి 15 ఇదే రోజున గుంటూరు మున్సిపాలిటీ కౌన్సిల్ ఓ చారిత్రక తీర్మానం చేసింది. మహాత్మా గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంకు పూర్తి మద్దతు ప్రకటించింది. గాంధీ మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి దండి యాత్రను ప్రారంభించారు. మూడు రోజుల తర్వాతే, గుంటూరు మున్సిపాలిటీ కౌన్సిల్ పూర్తి సహకారం అందించాలని నిర్ణయించింది. ఇది జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక మైలురాయి.