ఫిషింగ్ హార్బర్ను పరిశీలించిన కాకాణి
NLR: కావలి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈనెల 15న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హెలీపాడ్, సభా ప్రాంగణం ఏర్పాట్లను సమీక్షించారు. కూటమి ప్రభుత్వం హార్బర్ను ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మత్స్యకారుల హక్కులు కాపాడాలని, పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.