కేంద్రమంత్రి బండిని ప్రేరణగా తీసుకున్న BJP జిల్లా అధ్యక్షుడు
WGL: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో BJP జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ బండి సంజయ్ను ప్రేరణగా తీసుకున్నారు. తన GRK ఫౌండేషన్ తరపున శివనగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 60 మంది టెన్త్క్లాస్ విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు చెల్లించారు.