'రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్
కృష్ణా: సోమవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక- మీకోసం కార్యక్రమం నిర్వహించబడుతుందని కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.