VIDEO: మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు వివరాలు

WGL: రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,400 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.14,100 ధర పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.16,300 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,000 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.