యాదాద్రి దేవస్థాన నేటి ఆదాయ వివరాలు
యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,44,724, బ్రేక్ దర్శనాలతో రూ.1,09,200, వ్రతాలతో రూ.3,14,000, వీఐపీ దర్శనాలతో రూ.1,95,000, కార్ పార్కింగ్ రూ.2,40,500, ప్రసాద విక్రయాలతో రూ.6,05,410, లీజులతో రూ.79,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.20,05,021 ఆదాయం వచ్చింది.