జోరందుకున్న సాగు.. పెరిగిన యాసంగి విస్తీర్ణం

జోరందుకున్న సాగు.. పెరిగిన యాసంగి విస్తీర్ణం

VKB: జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలోని 3,34,627 మంది రైతులు ఉత్సాహంగా సాగు చేపట్టగా, వరి సాగు విస్తీర్ణం గతంలో ఉన్న 75,838 ఎకరాల నుంచి ప్రస్తుతం 93,116 ఎకరాలకు చేరింది. ఇతర పంటలతో కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,45,241 ఎకరాల్లో సాగు జరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడంపై వ్యవసాయ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.