నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

SKLM: ఆమదాలవలస పట్టణంలో గల స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమదాలవలస టీడీపీ కార్యాలయం నుంచి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రజల తమ సమస్యల ను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.