బావి పడి ఇద్దరు పిల్లలకు గాయాలు

బావి పడి ఇద్దరు పిల్లలకు గాయాలు

KMR: బావిలో పడి ఇద్దరు పిల్లలకు గాయాలైన ఘటన పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి కాలనీలోని పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు. రింగులతో ఏర్పాటుచేసిన బావి సిమెంట్ పైకప్పుపై పిల్లలు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కూలిపోవడంతో బావిలో పడిపోయారు. దీంతో ఇర్ఫాన్(7), రహేల(7) చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.