గంజాయి పట్టివేత.... ఇద్దరిపై కేసు నమోదు

గంజాయి పట్టివేత.... ఇద్దరిపై కేసు నమోదు

JGL: వెల్గటూర్ మండలం జగదేవపేట శివారులో గంజాయి పట్టుబడింది. ఎస్సై పి.ఉదయ్ కుమార్ పోలీస్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్, కళ్యాణ్‌ నిషేధిత గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.