నేడు GVMCలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'
విశాఖలోని GVMC ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాల్లో సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, టౌన్ ప్లానింగ్ వంటి సమస్యలపై ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించవచ్చనారు.