అక్రమ ఇసుక డంపుల సీజ్
NRPT: మరికల్ మండలం రాకొండ ఊకచెట్టు వాగు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును బుధవారం రాత్రి పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీఐ భగవంతు రెడ్డి, ఎస్సై రాము ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు మూడు హిటాచీలు, రెండు టిప్పర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.