నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని DE రాజన్న ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వినియోగదారులు గమనించాలని కోరారు.