VIDEO: బేగంబజార్లో బస్తీ వాసుల ఆందోళన
HYD: గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని వ్యతిరేకిస్తూ బేగం బజార్లో బాలయ్య వాడ బస్తీ వాసులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించి వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. వంద ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్న తమ ఇండ్లను కూల్చవద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.