'బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ సద్వినియోగం చేసుకోండి'
ELR: నూజివీడులో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీలోపు అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. నిబంధనల మేరకు పీనలైజేషన్ చార్జీలు చెల్లించి, విచారించిన మీదట క్రమబద్ధీకరించడం జరుగుతుందన్నారు.