చాటింగ్ చేసి 24 లక్షలు పోగొట్టుకున్న ఉద్యోగి
BPT: జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సైబర్ మోసానికి గురైన ఘటన చీరాలలో శనివారం చోటుచేసుకుంది. ఇన్స్టాలో ప్రకటన చూసి రూ. 24.16 లక్షలు పెట్టి కేటుగాళ్ల చేతుల్లో మోసపోయాడు. కేటుగాళ్లు ఫోన్లకు స్పందించకపోవడంతో బాధితుడు భయాందోళనకు గురై పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.