క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. నగదు స్వాధీనం
KRNL: ఎమ్మిగనూరులో IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదోనికి చెందిన శివమూర్తి అనే వ్యక్తి ఓ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద రూ. 22 లక్షల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదోని DSP భార్గవి వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.