ప్రారంభమైన మూడో విడత పోలింగ్
WGL: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 మండలాల పరిధిలోని 531 గ్రామ పంచాయతీలు, 4,101 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గంట విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.