అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్

GNTR: ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్డులో ఉన్న తాడికొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.