లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం: సీఐ

లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం: సీఐ

SRPT: విద్యార్థులు నిరంతర సాధనతోనే ఉన్నత లక్ష్యాలను అధిగమించగలరని తుంగతుర్తి సీఐ నరసింహారావు అన్నారు. నూతన్ కల్ మండల కేంద్రంలో మేరీస్ హైస్కూల్‌లో నిర్వహించిన ‘పోలీస్ ప్రజా భరోసా’లో ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థుల్లో ధైర్యం నింపుతూ, క్రమశిక్షణతో చదివి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.