నేడు తెలంగాణ పెన్షనర్ల ఫోరం మహాధర్నా
TG: తెలంగాణ పెన్షనర్ల ఫోరం మహాధర్నాకు కన్వీనర్ రఘునందన్ పిలుపునిచ్చారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించాలనే డిమాండ్తో ఇవాళ 'ఛలో హైదరాబాద్' తలపెట్టారు. ప్రభుత్వం తక్షణమే JAC నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.