ముగ్గురు ఆలయ ఉద్యోగులకు పదోన్నతులు
SRCL: వేములవాడ రాజన్న క్షేత్రంలో ముగ్గురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఆలయ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. బాసరలో పనిచేస్తున్న లక్ష్మణరావుకు ఏఈఓ (AEO) గా, సీనియర్ అసిస్టెంట్లు ఎడ్ల శివసాయి, ఓన్నారం భాస్కర్లకు పర్య వేక్షకులుగా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతుల పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.