నేడు జిల్లా వ్యాప్తంగా గృహ ప్రవేశాలు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా బుధవారం 14,486 గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మరోవైపు PMAY 2.0 క్రింద 2,091 ఇళ్లులు మంజూరు కాగా వాటి లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 1 లక్షను అందించనుంది.